జమ్మూలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇద్దరు హతం..

 

జమ్ముకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్ముకాశ్మీర్‌లో షోపియాన్‌ జిల్లాలోకి ఈ రోజు తెల్లవారు జామున ఉగ్రవాదులు చొచ్చుకొని రాగా.. భారత సైన్యం వారిని సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అదే సమయంలో పూంచ్ సెక్టార్ లో కాల్పులు జరిగాయి. అక్కడ కూడా మరో ఉగ్రవాది హతమవ్వగా.. ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసకున్నారు. ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu