విశాఖలో సీఎం ఆఫీసు శంకుస్థాపన డేట్ ఫిక్స్ ..

ఎపి లో మూడు రాజధానుజుల బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో రాజధానిలో భాగమైన సెక్రటేరియట్ తరలింపు పై విశాఖ వాసులలో ఉత్కంఠ మొదలైంది. తాజాగా ఇదే విషయమై ఎపి రెవిన్యూ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఆగస్టు 15 న సీఎం జగన్ విశాఖలో సీఎం ఆఫీసు కు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ శ్రావణ మాసం లోని మంచి రోజులలో విశాఖలో పాలనా రాజధాని పనులు మొదలు పెట్టబోతున్నట్లుగా అయన తెలిపారు. దీంతో అటు ఉత్తరాంధ్ర కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని అయన ఆశాభావం వ్యక్తం చేసారు.