మరో ప్రాణాన్ని తీసిన జగన్ పార్టీ మద్యం

 

 

 

జగన్ పార్టీ పంచుతున్న మద్యం ఓటర్ల ప్రాణాలు తీస్తోంది. సీమాంధ్రలో నిన్నటి వరకు వైకాపా పంచిన మద్యం కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలింగ్ రోజున కూడా ఒక ఓటరు మీద వైకాపా మద్యం కాటు పడింది. అనంతపురం జిల్లా నల్లచెరువు గ్రామంలో వైకాపా కార్యకర్తలు పంచిన మద్యం తాగి ఒక ఓటరు మరణించాడు. మరో నలుగుర్ల తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. ఓటర్లకి మద్యం తాగించి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళాలని ప్రయత్నించిన వైకాపా కార్యకర్తలు ఒకరు మరణించడం, నలుగురు అస్వస్థతకి గురి కావడంతో అదిరిపోయి అక్కడి నుంచి పారిపోయారు. పోలింగ్ రోజున వైకాపా మద్యం భారీ స్థాయిలో పంచడానికి ఏర్పాట్లు చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. అయితే వైకాపా మద్యాన్ని అడ్డుకోవడంతో ఎన్నికల కమిషన్ విఫలం కావడంతో మరో ప్రాణం గాలిలో కలిసిపోయింది.