జగన్... ఇక దొంగ జపాలు కట్టిపెట్టు-రావెల

జగన్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడని మంత్రి రావెల కిశోర్‌బాబు మండిపడ్డారు. కేసీఆర్‌తో కుమ్మక్కై ఏపీ ప్రయోజనాలకు ఆటంకం కలిగిస్తున్నాడని మండిపడ్డారు. దీక్షల పేరుతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని జగన్ చూస్తున్నారన్న రావెల, దొంగ జపాలు చేయడం మానాలంటూ సూచించారు, అంతగా దీక్షలు చేయాలనుకుంటే ఢిల్లీ చేయాలంటూ హితవు పలికారు, ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదన్న రావెల...ఏదో రకంగా అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu