జగన్ వి స్వార్థ రాజకీయాలంటున్న బీజేపీ మంత్రి

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్వార్థంతోనే గుంటూరులో దీక్షకు దిగుతున్నారని ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ఆరోపించారు, విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తాననడం విడ్డూరమన్నారు. ఏపీ ప్రయోజనాల విషయంలో జగన్ కు చిత్తశుద్ధి లేదన్న మాణిక్యాలరావు... రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కృషిచేస్తోందని అన్నారు, అడిగినా అడగకపోయినా పోలవరం ముంపు మండలాల విషయంలో ఎన్డీఏ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసిందని గుర్తుచేసిన ఆయన, మిగతా ప్రాజెక్టులు కూడా పరిశీలన దశలో ఉన్నాయని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu