పీఎస్ఎల్వీ సి-22 ప్రయోగం సక్సెస్
posted on Jul 2, 2013 11:45AM
విపత్తులకు, విమానాలకు ఎంతో ఉపయోగపడే ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. దీనిని సోమవారం అర్ధరాత్రి ప్రయోగించారు. రాత్రి 11.41 నిమిషాలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది. ఇది తొలి భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహం. దీనిని రోదసీలోకి పంపించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన మన దేశం చేరింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్లో అంతరిక్ష పరిశోధకులు అవిశ్రాంతంగా పనిచేసి చోదక వ్యవస్థకు మార్గదర్శిగా ఉపయోగపడే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఈ తొలి ఉపగ్రహాన్ని (ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఏ) విజయవంతంగా ప్రయోగించారు. పిఎస్ఎల్వీ సి22 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని మోసుకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది. మిషన్ డైరెక్టర్ డాక్టర్ సురేష్తోపాటు ఈ ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందించారు. 44 మీటర్ల ఎత్తున్న ఈ ఉపగ్రహం పదేళ్లపాటు పని చేస్తుంది. ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ప్రయోగానికి అయిన ఖర్చు రూ.1,600 కోట్లు.