మోపిదేవికి మళ్ళీ అస్వస్థత
posted on Jul 2, 2013 12:25PM
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వెన్నునొప్పితో బాధ పడుతుండడంతో జైలు అధికారులు చికిత్స కోసం నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆసుపత్రికి తరలించారు. మోపిదేవి వెన్నునొప్పితో పాటు అధిక రక్త పోటుతో బాధ పడుతున్నారు.
మోపిదేవికి గత కొంతకాలంగా అస్వస్థతకు గురవుతూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో వైద్యులు చికిత్స చేశారు. చికిత్స అనంతరం ఆయనను జైలుకు తరలించారు.