ఐసిస్ చెరలో మరో ఇద్దరు భారతీయులు
posted on Sep 16, 2015 8:59PM
.jpg)
ఇంతకు ముందు లిబియాలో సిర్తే పట్టణం నుంచి నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఐ.యస్.ఐ.యస్. (ఐసిస్) ఉగ్రవాదులు మళ్ళీ మరో ఇద్దరు భారతీయులను కిడ్నాప్ చేసినట్లు భారత విదేశాంగ శాఖ ద్రువీకరించింది. ఆంధ్రాకు చెందిన కొసనం రామ్మూర్తి, ఓడిశాకు చెందిన రంజాన్ సమాల్ అనే ఇద్దరినీ ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. జూలై 31న కిడ్నాప్ అయిన గోపీ కృష్ణ, బలరామ్ అనే ప్రొఫెసర్లు నేటికీ ఐసిస్ ఉగ్రవాదులు చెరలో బందీలుగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మరో ఇద్దరు కిడ్నాప్ చేయబడ్డారు. ఆ నలుగురిని ఉగ్రవాదుల చెరలో నుండి విడిపించేందుకు అధికారులు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి ఎంతవరకు సఫలం అవుతాయో ఎవరికీ తెలియదు.