కిడారికి గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి!

అరకు వైసీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు...పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న కిడారి...పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కిడారి అంటీముట్టనట్లుగానే వ్యవహరించారని చెబుతున్నారు. కొణతాల మనిషిని కావడం వల్లే తనను పక్కనపెడుతున్నారని, నియోజకవర్గంలోనూ వేరొకరికి ప్రాధాన్యత ఇస్తూ తనను సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇక సర్దుకుపోవడం కష్టమని కిడారి అంటున్నారట. అయితే కిడారికి తెలుగుదేశం పార్టీ గాలం వేసిందని, గిరిజన కార్పొరేషన్ ఛైన్మన్ పదవి ఆఫర్ చేయడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu