రైల్వే ఉద్యోగులకు కేంద్రం బంపరాఫర్..దసరా బోనస్

 

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ఇచ్చింది. దసరా పండుగు సందర్బంగా రైల్వే సిబ్బందికి 78 రోజుల బోనస్ అందనుంది. రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడి ఉన్న బోనస్ (పీఎల్ బీ) ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈసందర్భంగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. దసరా పండగ ముందే ఉద్యోగులకు బోనస్ అందిస్తామని చెప్పారు. కాగా, గత ఏడాది వరకు పీఎల్ బీపై ఉన్న పరిమితి రూ.3,500 నుంచి రూ.7వేలకు పెరగడంతో ఈ ఏడాదిలో ఉద్యోగులు అందుకోనున్న బోనస్ కూడా బాగానే పెరిగింది. ప్రతి ఉద్యోగికి దాదాపు రూ.18 వేల చొప్పున బోనస్ లభించనుంది. ఈ బోనస్ ద్వారా దాదాపు 13 లక్షల మంది రైల్వే ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu