మళ్ళీ మరో వడ్డింపుకి సిద్దమయిన రైల్వే శాఖ
posted on Dec 4, 2015 7:50PM
.jpg)
గత ఏడాదిన్నరగా రైల్వే శాఖ ఏదో ఒక విధంగా ప్రజల వద్ద నుండి డబ్బులు పిండుకొంటూనే ఉంది. ఒకసారి ప్లాట్ ఫారం టికెట్ ధరలు పెంచుతుంది. మరొకసారి ఆన్ లైన్ టికెట్లను రద్దు చార్జీలను పెంచుతుంది. లేకుంటే తత్కాల్ చార్జీలు పెంచుతుంది. తత్కాల్ అంటేనే అప్పటికికప్పుడు అత్యవసరంగా కొనుకొనే విధానం. మళ్ళీ దానిలో ప్రీమియం తత్కాల్, రైల్వే టికెట్ల వేలం పాటలు అంటూ రకరలుగా ప్రజలను దోచుకోంటోంది. రైల్వే శాఖ ఇలాగ చట్టబద్దంగా ప్రయాణికులను దోచుకొంటుంటే, దొంగలు పట్టపగలే రైళ్ళలో ఎక్కి దోపిడీలు చేస్తున్నారు. ఇప్పుడు రైల్వే శాఖ మళ్ళీ వడ్డనకి సిద్దమయింది. ఇంతవరకు 5-12సం.ల వయసు గల పిల్లలకు ప్రయాణ చార్జీలలో ఇస్తున్న రాయితీని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, 2016 నుండి ఈ నిర్ణయం అమలు లోకి వస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది.