ఐపీఎల్‌కి బాంబే హైకోర్టు షాక్..!

బీసీసీఐకీ గట్టి షాక్ తగిలింది. మహారాష్ట్రలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లను వేరే వేదికలకు తరలించాలని బాంబే హైకోర్టు బీసీసీఐని ఆదేశించింది. కరువు పరిస్థితులన్నప్పటికి నీటి ఎద్దడిని పట్టించుకోకుండా ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నారని, ఇందుకు లక్షల నీటర్ల నీరు వినియోగించాల్సి ఉంటుందని, అందువల్ల మహారాష్ట్రలో జరిగే మ్యాచ్‌లను వేరే ప్రాంతాలకు తరలించాలని బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిని విచారించిన బాంబే హైకోర్టు ఈ నెల 30 తరువాత మహారాష్ట్రలో నిర్వహించాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లను వేరే వేదికలకు మార్చాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.