జింబాబ్వే సిరీస్ సొంతం చేసుకున్న భారత్..

 

జింబాబ్వే రాజధాని హరారే వేదికగా టీమిండియా-జింబాబ్వే వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి రెండు వన్డేలు జరగగా.. రెండింటిలో భారత్ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టు కేవలం 34.4 ఓవర్లలో 126 పరుగులు చేసి అలౌట్ అయింది. ఇక అనంతరం 127 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 26.5 ఓవర్లలో 127 పరుగులు సాధించి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మూడు వికెట్లు తీసిన చాహల్ నిలిచాడు. దీంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు వన్డే సిరీస్ ను సొంతం చేసుకుంది.