మూడో రోజు ముగిసిన ఆట... ఆధిక్యంలో ఇండియా..

 

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.  తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 400 పరుగులు సాధించగా, దానికి దీటుగా టీమిండియా బ్యాట్స్ మన్ ఆడారు. ఈరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 51 పరుగుల ఆధిక్యం సాధించింది.  142 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 451 పరుగుల వద్ద మూడో రోజు ఆటను ముగించింది. ప్రధానంగా మురళీ విజయ్ (136), కెప్టెన్ విరాట్ కోహ్లీ (147) అద్భుతంగా ఆడారు. ఇంకా మూడు వికెట్లు చేతిలో ఉండగా, రేపు ఆట టీమిండియా, ఇంగ్లండ్ జట్లకు కీలకంగా మారనుంది. పిచ్ టర్న్ అవుతుండడంతో రెండు జట్లకు విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు మ్యాచ్ డ్రాగా ముగిసేందుకు కూడా అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu