ఈడెన్ లో భారత్ ఘన విజయం

 

ఈడెన్ గార్డెన్ లో భారత్-వెస్టిండీస్ ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ను భారత్ ముడురోజుల్లో ముగించి విజయపతాకం ఎగురవేసింది. రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకోగా, మహ్మద్ షమీ అద్భుత బౌలింగ్ తో మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చారు. మొదటి ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసిన వెస్టిండీస్, రెండో ఇన్నింగ్స్ లో కేవలం 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ మొదటి ఇన్నిం గ్స్ లో 453 పరుగులు చేసింది. 177 పరుగులతో మ్యాచ్ ను ఒంటి చేత్తో నడిపించిన రోహిత్ శర్మ, అలాగే ఒకే మ్యాచ్ లో 9 వికెట్లు తీసి మ్యాచ్ ను శాసించిన మహ్మద్ షమీ ఇద్దరు సూపర్ హీరోలుగా నిలిచారు. రోహిత్ కు అండగా సెంచరితో కదం తొక్కిన బౌలర్ అశ్విన్ ని కూడా మరువకూడదు. ఇంకా 5 రోజులు మ్యాచ్ సాగుతుంది. సచిన్ బ్యాటింగ్ మళ్లీ రెండోసారి చుద్దామని అనుకున్న ఆయన అభిమానులందరికి నిరాశే మిగిలింది. అయితే సచిన్ ఆడుతున్న199 టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించిందనే సంతృప్తితో అభిమానులు అతనికి ఈడెన్ గార్డెన్ మైదానంలో ఘనంగా వీడ్కోలు పలికారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu