హైడ్రోజన్ వాటర్ తో ఇమ్మ్యూనిటి.. 

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అంత ఇంత కాదు.  ఆక్సిజన్‌ అందక పిట్టల రాలిపోతున్నారు. ఆక్సిజన్ లేక మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అందించడంలో అటు దేశంలో లోటుపాట్లు నెలకొంటున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా బాధితులకు ప్రత్యేక అల్కలైన్‌ హైడ్రోజన్‌ వాటర్‌ను దివ్యాయుషాధంగా అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్‌లోని మెడిలైట్‌ హెల్త్‌కేర్‌ సంస్థ. హైడ్రోజన్‌ గ్యాస్‌తో కూడిన ఈ నీళ్లను తాగితే కరోనా రోగుల్లో ఆక్సిజన్‌ స్థాయి పెరగడమే కాకుండా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. కరోనా చికిత్సలో హైడ్రోజన్‌ థెరపీతో మంచి ఫలితాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.  

కరోనా చికిత్సలో రోజురోజుకూ కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అయినప్పటికీ రోగుల్లో ఆక్సిజన్‌ స్థాయి పడిపోడవం వల్ల అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గత 20 ఏళ్లుగా చైనా, జపాన్‌, అమెరికా దేశాల్లో అమలు చేస్తున్న హైడ్రోజన్‌ థెరపీని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మెడిలైట్‌ హెల్త్‌కేర్‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ సహా అనేక విశ్వ విద్యాలయాలు, ప్రయివేట్‌ సంస్థల పరిశోధనల్లో హైడ్రోజన్‌ థెరపీలో ఇచ్చే అల్కలైన్‌ హైడ్రోజన్‌ వాటర్‌ రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి పెంచడమే కాకండా దెబ్బతిన్న కణాల పునరుద్ధరణకు దోహదపడుతుందని రుజువయింది.  

ఈ క్రమంలోనే 2016 నుంచి మెడిలైట్‌ హెల్తెకేర్‌ సంస్థ  నగరంలోని చాలా ప్రాంతాలకు అల్కలైన్‌ హైడ్రోజన్‌ రిచ్‌ వాటర్‌ను సరఫరా చేస్తోంది. ఆసుపత్రులు, గృహ అవసరాలకు అనుగుణంగా 20 లీటర్ల క్యాన్లలో ఈ వాటర్‌ను పంపిణీ చేస్తోంది. ఈ నీటిని తాగిన వాళ్లలో ఆక్సిజన్‌ స్థాయి సాధారణంగా ఉండటమే కాకుండా.. రోగనిరోధక శక్తి మెరుగవుతుందని మెడిలైట్‌ హెల్త్‌కేర్‌ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్రీనివాస్‌ చెబుతున్నారు.  

ఆల్కలైన్‌ హైడ్రోజన్‌ వాటర్‌ విటమిన్‌ ‘సి’ కంటే 188 రెట్లు అధిక ప్రయోజనాలు చేకూరుస్తుందని ఆక్స్‌ఫార్డ్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్‌తో పాటు హైడ్రోజన్ వాయువు విడుదల అవుతుంది. ఆ నీటిని తాగడం ద్వారా రక్తం లోకి హైడ్రోజన్‌ త్వరగా కలిసి పోయి కణాలకు ఆక్సిజన్‌ అందిస్తుంది. తద్వారా కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు దోహదపడుతుంది.   

ప్రస్తుత సమయంలో కరోనా వైరస్‌ ఊపిరితిత్తులను బాగా దెబ్బతీస్తోంది. కణజాల వ్యవస్థను క్షీణింపజేస్తోంది. దీంతో బాధితులు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అల్కలైన్‌ హైడ్రోజన్‌ వాటర్‌ తీసుకోవడం ద్వారా శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పెరిగి ఊపిరితిత్తుల వాపు తగ్గుతుంది. అలాగే కణాల క్షీణత అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.