హైదరాబాద్ యుటిపై దిగ్విజయ్ సింగ్

 

Digvijay Singh, hyderabad Digvijay Singh, Congress leader Digvijay Singh

 

 

రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని అంశాలను ఆంటోని కమిటీ చూస్తోందని కాంగ్రెసు పార్టీ ఎపి ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసే విషయం తనకు తెలియదని చెప్పారు. విభజనకు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని, అలాంటప్పుడు మళ్లీ వ్యతిరేకత ఎక్కడిదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంతకుముందు డిగ్గీని కలిశారు. ఆయనతో అరగంట పాటు భేటీ అయ్యారు. కాగా ఇంతకుముందు హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అవుతుందా అంటే దిగ్విజయ్ సింగ్ ఖండించేవారు. ఈసారి ఖండించకపోవడం విశేషం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu