ప్రవేశపన్నుపై నేడు హైకోర్టు తీర్పు
posted on Apr 10, 2015 8:52AM
.jpg)
ఆంధ్రా వాహనాలపై ప్రవేశపన్నువిధిస్తూ గతేడాది తెలంగాణా ప్రభుత్వం జీ.ఓ. జారీ చేసినప్పుడు, దానిని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించడమే కాకుండా మార్చి31,2015వరకు అమలుచేయకుండా నిలిపివేసింది. ఆగడువు ముగిసింది కనుక తెలంగాణా ప్రభుత్వం మళ్ళీ కొత్తగా మరో జీ.ఓ. జారీ చేసింది. కానీ దానిపై కూడా ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు కోర్టులో పిటిషను వేసాయి. వారి పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు దానిపై తీర్పు చెప్పేవరకు వారి వద్ద నుండి ప్రవేశపన్ను వసూలు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పిటిషనుపై ఈరోజు హైకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ప్రవేశపన్ను వసూలుపై హైకోర్టు స్టే విధించడం ఎదురుదెబ్బ అనుకొంటే, ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపన్ను కోసం జారీ చేసిన జీ.ఓ.పై హైకోర్టు మళ్ళీ అభ్యంతరం వ్యక్తం చేసినా, స్టే విధించినా చాలా అవమానకర విషయం అవుతుంది.