వారివల్ల ఏపీ నలిగిపోతుంది.. శివాజీ

 

సినీ నటుడు శివాజీ ఎపీ సీఎం చంద్రబాబు.. ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు కురిపించారు. చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డి వీరిద్దరు వల్ల ఏపీ నలిగిపోతుందన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆందోళనలు కేవలం వారి పేరుకే గాని ఆందోళన వల్ల ఏపీ ప్రజలకు ఒరిగేది ఏదీ లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ ఏకంగా ఢిల్లీలో ధర్నా చేశారు కానీ ఆపార్టీ ఎంపీలు మాత్రం పార్లమెంట్లో ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu