విశాఖకు నీలం దెబ్బ

Heavy rain at Visakhapatnam, Heavy rain Visakhapatnam, Heavy rain cripples life in Vizag

 

 

నీలం తుఫాన్ దెబ్బకు విశాఖ జిల్లా విలవిల్లాడుతోంది. జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. షీలానగర్, హరిజన జగ్గయ్యపాలెం, అయ్యప్పనగర్ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. హుకుంపేట మండలం చిదుపుట్టు వద్ద వంతెన కొట్టుకుపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మనగపక మండలం ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. ముఖ్య రహదార్లపై భారీగా నీరు ప్రవహిస్తోంది. నాతవరం సమీపంలో వరద నీటిలో మూడు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ప్రయాణీకులను రక్షించేందుకు మూడు పడవలను ఏర్పాటుచేశారు.