పట్టపగలే మహిళపై అత్యాచారం, హత్య

 

Lady rape, lady murder, lady assaulted, lady death, kookat pally, Hyderabad murder, hayderabad lady murder, telugu news, teluguone news

 

హైదరాబాద్ కూకట్ పల్లి గాయత్రీ నగర్ లో ఉంటున్న ఓ మహిళను పట్టపగలు కొందరు దుండగులు, దారుణంగా రేప్ చేసి చంపేశారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు కంపెనీ నుంచి ఇంటికొచ్చిన మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తలుపు తెరిచి ఉండడంతో ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. బాధితురాలి కాళ్లూ చేతులూ కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని, మెడకి కరెంట్ వైర్ ని చుట్టి ఊరేసి చంపేశారని పోలీసులు చెబుతున్నారు. తెలిసినవాళ్లే ఈ పని చేసుంటారన్న అనుమానంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీస్ జాగిలం.. బాధితురాలు పనిచేస్తున్న బైండింగ్ వర్క్స్ కంపెనీ దగ్గరికెళ్లి ఆగడం ఈ అనుమానాల్ని బలపరుస్తోంది.