గవర్నర్ సాష్టాంగ నమస్కారాలు.. సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది

 

గవర్నర్ నరసింహన్ కు దైవభక్తి కాస్త ఎక్కవే అని మనందరికి తెలిసిన విషయమే. ఆయన భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల బాలాజీని అమితంగా అరాధించే ఆయన కనీసం నెలకు ఓ రెండు సార్లు అయినా దేవుని దర్శనార్దం తిరుమలకి వెళుతుంటారు. అయితే ఆయన భక్తి ఎలా ఉన్నా ఆయన వల్ల మాత్రం సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆయన వల్ల సెక్యూరిటీ ఇబ్బంది పడటం ఏంటనుకుంటున్నారా.. నిన్న ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ కూడా విచ్చేశారు. శంకుస్థాపన అనంతరం మోడీ తిరుమల బాలాజీని దర్శించుకోవడానికి వెళ్లగా ఆయనతో పాటు గవర్నర్ కూడా వెళ్లారు. అక్కడికి వెళ్లిన గవర్నర్ ప్రధాని వెంట నడిచారు. అయితే ఆలయం లోపలికి వెళ్లిన వెంటనే గవర్నర్ ఒక్కసారిగా ధ్వజస్తంభానికి సాష్టాంగ నమస్కారం పెట్టడంతో వెనుక ఉన్న భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాకయ్యి ఆయన్ని దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఒక్క సాష్టాంగ నమస్కారమే కదా అని అనుకున్న సిబ్బందికి.. తాను వరుసగా ఐదారు పెట్టేసరికి వెనక్కి వెళ్లలేక.. అటు ముందుకు వెళ్లలేక కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu