చంద్రబాబు, కేసీఆర్ మధ్య పంచాయతీ లేదు.. మీ మధ్య ఎందుకు.. కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ అందరికి తెలిసిన విషయాన్నే మరోసారి చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఎలాంటి పంచాయితీ లేదని.. వారి మధ్య ఎలాంటి గొడవలు విభేధాలు లేవు.. వారి విషయంలో అనవసరంగా ప్రజల మధ్య పంచాయితీలు ఎందుకని అన్నారు. తెలంగాణ అభివృద్దికి అందరూ పాటుపడదాం.. హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములమవుదామవుదాం అని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్ ను నమ్మాలని.. ఆయనకు గ్రేటర్లో గెలిచే అవకాశం ఇవ్వాలని.. మేనిఫెస్టోలో చెప్పినవి అన్నీ తప్పకుండా చేస్తారని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu