రిపబ్లిక్ డే హై అలర్ట్.. ఎన్‌కౌంటర్‌ టెన్షన్

రిపబ్లిక్ డే సందర్బంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని అనుమానించి భద్రతా దళాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. అయితే ఈ భద్రతా దళాల బందోబస్తు నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్‌ జరుగడం కలకలం రేపింది. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో పోలీసు చెక్‌పోస్టు వద్ద ఎన్‌కౌంటర్‌ జరిగింది. దీంతో పోలీసులు అలర్ట్ అయి ఘటనా స్థలానికి వెళ్లి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు పరారైనట్టు తెలుస్తోంది. కాగా అరెస్ట్ అయిన వ్యక్తి పేరు అంకిత్ అని.. అతను ఓ పేరు మోసిన దొంగ అని.. అతని పేరు 25వేల రివార్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu