హైదరాబాద్‌లో ఏపీ టీడీపీ నేత భవంతిని కూల్చేసిన జీహెచ్‌ఎంసీ

తెలుగుదేశం పార్టీ నేత, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు‌కు చెందిన భవంతిని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు భారీ పోలీసు భద్రత మధ్య కూల్చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.17లో కంభంపాటి భవంతి ఉంది. దీనిని ఆయన నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నిర్మించారని అధికారులు పేర్కొన్నారు. పలుమార్లు నోటీసులు పంపినప్పటికి స్పందించకపోవడంతో అక్రమ భవనాన్ని కూల్చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. భవనాన్ని కూల్చే సందర్భంలో జీహెచ్‌ఎంసీ అధికారులకు, కంభంపాటి అనుచరులకు మధ్య వాగ్వివాదం జరగడంతో పోలీసులు అనుచరులను చెదరగొట్టారు.