మనోభావాలు దెబ్బతీయం:చంద్రబాబు

కృష్ణా పుష్కరాల సందర్భంగా జరుగుతున్న పనుల నిమిత్తం విజయవాడలో కొన్ని దేవాలయాలను అధికారులు కూల్చివేశారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు తొలగించే విషయంలో ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తామన్నారు. దీనిపై ఇప్పటికే మంత్రుల కమిటీ వేశామని..ఇకపై తానే స్వయంగా పర్యవేక్షిస్తానని భరోసా ఇచ్చారు. గత కొన్నేళ్లుగా రోడ్లపై అనుమతి లేకుండా అనేక అక్రమ నిర్మాణాలు చేపట్టారని..వీటన్నింటిని తొలగించాల్సి ఉందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రోడ్లపై విగ్రహాలు, దేవాలయాలు నిర్మించకుండా చట్టం చేశామని గుర్తు చేశారు. రోడ్ల విస్తరణలో తప్పనిసరిగా దేవాలయాలు తొలగించాల్సి వస్తే సమీపంలోనే కొత్తవి నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో టీడీపీ, బీజేపీ శ్రేణులు ఉద్రిక్తతలకు పోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.