కన్నుల పండువగా గండికోట శోభాయాత్ర

గండికోట ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు ఆదివారం (జనవరి 11) శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.   గండికోట చారిత్రక, సాంస్కృతిక,  కళా వైభభం ఉట్టిపడేలా   అత్యంత వైభంగా ఉత్సవ వాతావరణంలో సాగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో సందర్శకులు, పర్యాటకులు పాల్గొన్నారు.

గ్రాండ్ కేన్వాస్ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందిన గండి కోట ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన మంత్రి కందుల దుర్గేష్  వచ్చే రెండు సంవత్సరాలలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలుపుతామన్నారు.  గండికోట మరింత అభివృద్ధి చెందడానికీ,  యునెస్కో ద్వారా గుర్తింపు రావడానికి స్థానికుల సహకారం అవసరమన్నారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్‌.సవితఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఎస్‌పి నచికేతన్‌ విశ్వనాథ్‌, ప్రముఖ రచయితలు తవ్వా ఓబుల్‌రెడ్డి,   సుధారాణి తదితరులు పాల్గొన్ని ప్రసంగించారు. విశిష్ఠ అతిథిగా పాల్గొన్న గేయ రచయత    జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గండికోట గేయాలాపన చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu