తెలంగాణలో నలుగురు రైతుల మృతి

 

తెలంగాణ రాష్ట్రంలో గురువారం నాడు నలుగురు రైతులు మరణించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను వేసిన పంట ఎండిపోవడంతో మనస్తాపం చెదిన ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఖమ్మం జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు రైతులు మరణించారు. జిల్లాలోని చంద్రుగొండ మండలం అయ్యనపాలెంలో ఒకరు, చర్ల మండలం లింగాపురంపాడు గ్రామంలో ఒకరు, ఇల్లెందు మండలం కొమురారంలో ఒకరు మరణించారు. జిల్లాలో బుధవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పొలాల్లో పనుల కోసం వెళ్ళిన రైతుల మీద పిడుగులు పడటంతో వారు మరణించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu