కాంగ్రెస్ నేత షీలా కౌల్ మృతి

 

కేంద్ర మాజీ మంత్రి షీలా కౌల్ శనివారం సాయంత్రం ఘజియాబాద్‌లోని ఆసుపత్రిలో కన్ను మూశారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. వృద్దాప్యం చేత వచ్చే ఆరోగ్యసమస్యలతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. గతంలో ఆమె హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేసారు. ఆమె ఐదు సార్లు పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె మాజీ భారత ప్రధాని స్వర్గీయ జవహర్‌లాల్ నెహ్రూకి మరదలు. ఆదివారం సాయంత్రం డిల్లీలో 4.30 గంటలకు ఆమె అంత్యక్రియలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితర అనేకమంది కాంగ్రెస్ ప్రముఖులు ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu