ప్యారిస్‌లో ఉగ్రవాదుల దాడి... 60 మంది మృతి

 

ప్యారిస్ నగరంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడిలో 60 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ప్యారిస్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడటంతో ఈ ఘోరం జరిగింది. ప్యారిస్ మొత్తంలో ఆరుచోట్ల కాల్పులు, మూడు చోట్ల పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది. ప్యారిస్ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడి కూడా జరిగినట్టు సమాచారం. అయితే కాల్పుల సంఘటనల తర్వాత సైన్యం అప్రమత్తమై మొత్తం వందమంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వస్తు్న్నాయి. కాల్పుల దుర్ఘటనల అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో ఎమర్జెన్సీని విధించారు. ఈ దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ప్యారిస్ కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu