ఫిజీలో మోడీకి ఘన స్వాగతం

 

ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఫిజీకి చేరుకున్నారు. అక్కడ నరేంద్రమోడీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మోడీ ఫిజీ పార్లమెంటులో ప్రసంగించారు. రాజకీయ కారణాల కారణంగా అక్కడి ప్రతిపక్షం పార్లమెంటుకు హాజరు కాలేదు. పార్లమెంటులో ప్రసంగం అనంతరం నరేంద్రమోడీ 12 పసిఫిక్ ద్వీప దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫిజీ ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫిజీ పర్యటన సంరద్భంగా మోడీ భారీగా ఆర్థిక సహాయం ప్రకటించారు. ఫిజీలో విద్యుత్ ప్లాంట్ కోసం ఏడు కోట్ల డాలర్లను సాయంగా ప్రకటించారు. ఫిజీ భారతదేశానికి అతి ముఖ్యమైన మిత్ర దేశమని మోడీ ఈ సందర్భంగా అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu