వ్యక్తిగత అభిప్రాయాలుండవు : బొత్స

న్యూ ఢిల్లీ : తెలంగాణ అంశం ఫై ప్రజలందరికి ఆమోదయోగ్యమైన నిర్ర్ణయం వస్తుందని పీసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు అయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లోగా తెలంగాణా ఫై నిర్ణయం వస్తుందని భావిస్తున్నానని అన్నారు.పీసిసి అద్యక్షుడికి వ్యక్తిగత అభిప్రాయాలుండవని తేల్చి చెప్పారు.తెలంగాణా ఫై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.తొందరపడి నిర్ణయం తీసుకోకూడదనేదే పార్టీ ఆలోచన అని తెలియజేశారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్యం మైనార్టీలో లేదని తెదేపా అవిశ్వాస తీర్మానం పెట్టినా నష్టం లేదని అయన స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu