ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది టీఆర్ఎస్ కాదా.. ఎర్రబెల్లి

రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నిన్న హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే విచారణ అనంతరం తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది ఏజి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఇంకో పది మంది ఎమ్మెల్యేలను కొంటే తెలంగాణ ప్రభుత్వమే కూలిపోతుందని ఏజి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శాసనసభ్యులను కొనుగోలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా.. ఎవరు ఎవరి ఎమ్మెల్యేలను కొన్నారో ప్రజలకు తెలియదా అని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీని దెబ్బగొట్టడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కుట్రలు చేస్తుందని విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu