పెరుగుతున్న వసూల్ రాజాలు?
posted on Jun 21, 2012 11:56AM
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులతో చెలగాటమాడేవారి సంఖ్య పెరుగుతోంది. ఏదో ఒక సంస్థ పేరు పెట్టుకుని దానిలో ఉద్యోగం కోసం పదివేలు కట్టాలని కొన్ని కన్సల్టెన్సీలు కోరుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు గురించి వెదికేందుకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగం వల్ల తీరిక ఉండక కన్సల్టెన్సీ సర్వీసులను నమ్ముతున్నారు. మనదేశంలో అలా కాదు. నేరుగా ఉద్యోగం ఉందో లేదో? నేరుగా కనుక్కోవచ్చు. కానీ, విదేశీసంస్కృతిని దిగుమతి చేసుకున్నంత స్పీడుగానే ఈ కన్సల్టెన్సీ సర్వీసుకు అలవాటు పడిపోయారు. అయితే ఈ కన్సల్టెన్సీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఒక్కోసారి నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఎక్కువ డిపాజిట్టు చేయించుకుంటున్నారు. అలానే వ్యక్తిగత ప్రయోజనం కూడా పొందుతున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా కన్సల్టెన్సీలు తమ ప్రతినిధులను నిరుద్యోగుల మీదకు పంపుతున్నారు. డబ్బు వ్యవహారంలో అదుపు ఉండదు కాబట్టి కొందరు ప్రతినిథులు సంస్థకు కూడా తెలియకుండా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలోనూ, వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, తిరుపతిల్లో ఈ కన్సల్టెన్సీ సర్వీసులు, వారి ప్రతినిథులు నిరుద్యోగులను ఆకర్షిస్తున్నారు. వరంగల్ జిల్లాలో కాంతమ్మాన్ ప్రాజెక్టు పేరిట దాని నిర్వాహకుడు మాచర్ల శ్రీనివాస్ నిరుద్యోగులను మోసం చేశాడని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇటువంటి ప్రాజెక్టులను, కన్సల్టెన్సీలను నమ్మొద్దని కోరుతున్నారు.