ఈడీ ముందు హాజ‌ర‌యిన వ‌ర్షా రౌత్‌

మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన సంజ‌య్ రౌత్ నుంచి సేక‌రించిన స‌మాచారం ఆధారంగా ఆయ‌న భార్య వ‌ర్షా రౌత్‌ను ఈడీ ముందు హాజ‌ర‌య్యారు. ప‌ట్రాచావ‌ల్ రీడ‌వ‌ల‌ప్మెంట్ అవ‌క‌త‌వ‌క‌ల పై ఈడీ ఆమెను ప్ర‌శ్నిస్తున్న‌ది. 

సంజయ్ రౌత్ కస్టడీని ఈనెల  8వ తేదీ వరకూ  పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఈనెల 4వ తేదీన పొడిగిం చింది. పట్రా చావల్ రీడవలప్‌మెంట్ వ్యవహారంలో  రౌత్ దంపతులకు రూ.3.3 కోట్లు ముట్టినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఇందులో ఎక్కువ మొత్తం వర్షా రౌత్  అకౌంట్లకు జమ అయ్యాయని చెబుతోంది. వర్షా రౌత్ బ్యాంక్ అకౌం ట్లను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చామని ఈడీ తెలిపింది. కాగా రౌత్ త‌న భార్య అకౌంట్‌లోకి పెద్ద మొత్తం లో వ‌చ్చిన సొమ్ము గురించి మాత్రం మౌనం వ‌హించారు. ఈ విష‌యంలో  విషయంపై ఈడీ దర్యాప్తు జరుపు తోంది. 

ఇదిలా ఉండ‌గా, అలీబాగ్ ల్యాండ్డీల్‌ డాక్యుమెంట్లతో సంబంధం ఉన్న వారిని కూడా ఈడీ ప్రశ్నిస్తోం ది. తమ విచారణలో భాగంగా సేకరించిన డాక్యుమెంట్లను బట్టి చూస్తే అలీబాగ్‌లోని బీచ్‌సైడ్ ఆస్తులను నగదు రూపంలో భూ యజమానులకు చెల్లించి సంజయ్ రౌత్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోం దని ఈడీ చెబుతోంది. పట్రా చావల్ రీడవలప్‌మెంట్‌ డీల్‌లో సంజయ్ రౌత్ సన్నిహిత మిత్రుడు ప్రవీణ్ రౌత్ కీలక పాత్ర పోషించారు. గురుఅవినాష్ కన్‌స్ట్రక్షన్స్ డైరెక్టర్లలో ఒకరుగా గురుఆశిష్ ప్రవీణ్ రౌత్ ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమైన గురు అవినాష్ కన్‌స్ట్రక్షన్  ఎఫ్ఎస్ఐకి అమ్మేసింది. ఈ ఫ్రాడ్ ద్వారా వచ్చిన రూ.1.2000 కోట్లలో రూ.112 కోట్లు కమిషన్‌ రూపంలో ప్రవీణ్ రౌత్‌కు చెల్లించారు. ప్రవీణ్ రౌత్‌‍కు అనుబంధంగా ప్రవీణ్ రౌత్ పనిచేశాడని, పట్రా చావల్ అవకతకవకల కారణంగా కోట్ల రూపాయలు సంజయ్‌ రౌత్‌ పొందారని ఈడీ ఆరోపిస్తోంది. ప్రవీణ్ రౌత్‌ను ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది.