ప్రత్యేక హోదా కోసం మరోప్రాణం బలి



ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే చాలా మంది నిరసనలు చేస్తున్నారు. గతంలో మునికోటి అనే వ్యక్తి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కిరోసిన్ పోసుకొని ఆత్మహుతి చేసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మరో ప్రాణం బలిగొంది. పశ్చిమగోదావరి జిల్లా ఉంగటూరు మండలం చేబ్రోలుకు చెందిన సుందరపు దుర్గాప్రసాద్ ఆగస్టు 25న ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా చాలా అవసరమని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్ర భవిష్యత్ బాగుపడుతుందని అన్నారు. అసలే ఆర్ధికంగా వెనుకబడి ఉన్న సీమాంధ్రకు కనుక ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ప్రజలకు కష్టాలు తప్పవని ఆరోపించారు. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలని.. ప్రత్యేక హోదా వస్తే వేలాది మందికి ఉపాధి కలుగుతుందని.. వేలాది మంది ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక హోదా కోసం తనను తాను బలి చేసుకుంటున్నట్టు లేఖ రాశారు. ఆ తరువాత కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే శరీరం బాగా కాలిపోవడంతో ఆయన్ను పలు ఆస్పత్రులకి తిప్పినా ఉపయోగం లేకుండా పోయింది.  ఈ ఉదయం ఆయన మరణించారు. ఆయనకు భార్య.. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu