తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం (ఆగస్టు 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 6 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

ఇక శుక్రవారం (ఆగస్టు 1) శ్రీవారిని మొత్తం 70 వేల 353 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 636 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 65 లక్షల రూపాయలు వచ్చింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu