తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తల రద్దీ అధికంగా ఉంది. గురువారం (మే1) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక బుధవారం (మే30) శ్రీవారిని 66 వేల 616 మంది దర్శించుకున్నారు. వారిలో 27 వేల 837 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 95లక్షల రూపాయలు వచ్చింది.