తిరమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (ఏప్రిల్ 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 13 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది.

ఇక బుధవారం (ఏప్రిల్ 16) శ్రీవారిని మొత్తం 70 వేల 372 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 463 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 5 కోట్ల 25లక్షల రూపాయలు వచ్చింది.