తిరుమల శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ. 3.55 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (ఫిబ్రవరి 24) శ్రీవారిని దర్శించుకునే భక్తులు క్యూ  కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.  ఆదివారం (ఫిబ్రవరి 23) శ్రీవారిని మొత్తం 78 వేల 892 మంది దర్శించుకున్నారు.

వారిలో 25 వేల 930 మంది తలనీతాలు సమర్పించుకున్నారు.  హుండీ కానుకల ఆదాయం  3 కోట్ల 55 లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (ఫిబ్రవరి 24) రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.  అలాగే మధ్యాహ్నం వసతి గదుల కోటాను విడుదల చేయనుంది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu