తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం (ఏప్రిల్ 16)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో  నాలుగు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది. సోమవారం (ఏప్రిల్ 15) శ్రీవారిని మొత్తం 77 వేల 511 మంది దర్శించుకున్నారు.

వారిలో 26వేల 553 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 28లక్షల రూపాయలు వచ్చింది.