తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. బుధవారం (జనవరి 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని మొత్తం 63వేల665 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 18వేల 630 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 44 లక్షల రూపాయలు వచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu