తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (నవంబర్ 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నభక్తులతో 4 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 58వేల 176 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 20 వేల 157 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

ఇక శ్రీవారి హుండీ కానుకలు 4 కోట్ల 22లక్షల రూపాయలు వచ్చాయి.