తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ స్వల్పంగా ఉంది. బుధవారం (అక్టోబర్ 25) ఉదయం శ్రీవారి దర్శనానికి క్యూలైన్ లో వేచి చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ లైన్ ద్వారా భక్తులను అనుమతిస్తున్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం (అక్టోబర్ 24) శ్రీవారికి 71వేల 37 మంది దర్శించుకున్నారు.

వారిలో 20 వేల 563 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 66 లక్షల రూపాయలు వచ్చింది.