తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (సెప్టెంబర్ 23) శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. శుక్రవారం (సెప్టెంబర్ 22) శ్రీవారిని మొత్తం 72వేల 650 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 27వేల 410 మంది తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 33లక్షల రూపాయలు వచ్చింది.