తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తల రద్దీ స్వల్పంగా తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది.

మంగళవారం తిరుమల శ్రీవారిని 75వేల 871 మంది భక్తులు దర్శించుకున్నారు.

32 వేల 859 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.27 కోట్ల రూపాయలు వచ్చింది. బుధవారం ఉదయం నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.