అజ్జూభాయ్ ఇంటికి కరెంట్, నీరు కట్

 

ఎంపీలుగా ఓడిపోయినవారు, మాజీ కేంద్ర మంత్రులు తమ పదవులు పోగానే బుద్ధిగా ఢిల్లీలోని తమ నివాసాలను ఖాళీ చేసి తమ తిప్పలేవో తాము పడటం అనేది సంప్రదాయం. అదే మర్యాద కూడా. అయితే కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ మర్యాదని పాటించరు. అలాంటి వారి విషయంలో అధికారులు అమర్యాదగా వ్యవహరిస్తూ వుంటారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అజారుద్దీన్ విషయం కూడా ఇలాగే తయారైంది. అయ్యగారి ఎంపీ పదవీకాలం ముగిసిపోయింది. మొన్నటి ఎన్నికలలో కూడా సార్ చిత్తుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని తన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలి. అయితే అజారుద్దీన్ మాత్రం అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇల్లు కాళీ చేయలేదు. దాంతో అధికారులు అజారుద్దీన్ ఇంటికి కరెంట్, వాటర్ సరఫరాని నిలిపేశారు. ఇప్పటికైనా అజారుద్దీన్ ఇంటిని ఖాళీ చేస్తారో లేదో చూడాలి. అన్నట్టు ఇలా కరెంట్, వాటర్ కట్ చేసింది కేవలం అజారుద్దీన్ ఒక్కడి ఇంటికే కాదండోయ్.. ఇలాంటి జిడ్డు మాజీ ఎంపీలు మొత్తం 30 మంది వున్నారట. వారు వుంటున్న ఇళ్ళన్నిటికీ కరెంట్, వాటర్ కట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News