దేశంలో అతి తక్కువ అటెండెన్స్ ఆ సీఎందే

ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రా మరో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యంత తక్కువ అటెండెన్స్ ఉన్న సీఎం..కేజ్రీవాలేనంటూ ఆరోపించారు. అరవింద్ ఏడాదిలో రెండుసార్లు మాత్రమే కార్యాలయానికి వస్తారంటూ ట్వీట్ చేశారు. కార్యాలయానికి వెళ్లకుండా, మంత్రులతో ఎలాంటి సమావేశాలకు హాజరుకాని ఏకైక ముఖ్యమంత్రి ఆయనే..అంతేకాదు ఎక్కువగా సెలవులు పెడుతూ అవినీతి కేసులు ఉన్న సీఎం కూడా అరవింద్ కేజ్రీవాలే అంటూ విమర్శించారు. కేజ్రీవాల్ రూ.2 కోట్లు లంచం తీసుకోవడం తాను కళ్లారా చూశానని కపిల్ మిశ్రా బహిరంగంగా ఆరోపణలు చేయడంతో మిశ్రాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు..ఇదే విషయమై మిశ్రా సీబీఐకి ఫిర్యాదు చేశారు. 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu