దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం..

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను ముంబైలో వేలం వేశారు. దావూద్ కు సంబంధించిన హోటల్ ను.. కారును వేలం వేశారు. వేలం పాటలో హోటల్ ను నాలుగు కోట్ల 28 లక్షలకి జర్నలిస్ట్ బాలకృష్ణన్ సొంతం చేసుకున్నారు. కాగా దావూద్ కారును 15 వేలకు ఆచార్య చక్రపాణి దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా వేలం పాటలో దావూద్ హోటల్ ను దక్కించుకున్న బాలకృష్ణన్ ను చోటా షకీల్ బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బాలకృష్ణన్ మాట్లాడుతూ డీ గ్యాంగ్ బెదిరింపులకు భయపడనని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu