రైతు ఆత్మహత్యలపై ర్యాలీ.. దానం నాగేందర్ అరెస్ట్

 

తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై అధికార పార్టీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులకు రుణమాఫీ చేయాలని దానివల్ల రైతులకు ఆర్ధికంగా సహాయపడినట్టు ఉంటుందని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని కోరుతూ తెలంగాణలోని కాంగ్రెస్తోపాటు వివిధ రాజకీయ పక్షాలు రేపు తెలంగాణలో బందుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రేపు నిర్వహించే బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్లతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. దీంతో పోలీసులు  వారిని అదుపులోకి తీసుకుని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు.